విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి- బలరాం జాదవ్

నేరడిగొండనవంబర్10(జనంసాక్షి):విద్య బలమే మహాబలం అని బలరాం జాధవ్ అన్నారు.మండలం కుమారి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో విధ్యవాలింటర్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ని గురువారం రోజున గ్రామస్తులు పాఠశాలకు ఆహ్వానించి తను చేస్తున్న సేవలకు శాలువాతో ఘనంగా సన్మానించారు.బలరాం మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణగా ఉంటు బాగా చదివి ఉన్నత స్థాయిని అధిరోహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లితండ్రులు విడిసి సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.