విద్యార్థుల జీవితానికి నాంది ఉపాధ్యాయులే

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 8:: విద్యార్థుల జీవితానికి నాంది ఉపాధ్యాయులేనని పరికి బండ సర్పంచ్ పూల అర్జున్ పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు విద్యార్థులకు క్రమశిక్షణతో చక్కని విద్యను నేర్పించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేంది ఉపాధ్యాయులేనని అన్నారు వారి కృషి వల్లనే మేధావులు తయారవుతారని అన్నారు మంచి నడవడిక క్రమశిక్షణతో అక్కుంటిత దీక్షతో విద్యను చదివి ఉన్నతులుగా ఎదుగుతారని అన్నారు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న వారైనా వారికి విద్యాబుద్ధులు నేర్పించింది గురువు లేని అన్న విషయం ప్రతి ఒక్కరూ మర్చిపోరాదని ఆయన కొనియాడారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి ఉపాధ్యాయులు శ్రీనివాస్ చారి నాగరాజు సుధాకర్ మహేందర్ రెడ్డి గౌరీ శంకర్ శర్మ శారద సల్మాన్ రాజు రమ ఉపాధ్యాయులను శాలువా పుష్ప గుచ్చంతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ యాదగిరి నరహరి వార్డు సభ్యులు విద్యా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు