విద్యార్థుల జీవితాలతో చెలగాటం

 బిజెపి ఆధ్వర్యంలో బాన్సువాడలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
బాన్సువాడ, జనంసాక్షి (జూలై 16):
బాసర ఆర్ జి యు కె టి లో మధ్యాహ్న భోజనం వికటించి దాదాపుగా 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని బిజెపి నాయకులు పేర్కొన్నారు. బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం త్రిబుల్ ఐటీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతనెల విద్యార్థులు వారం రోజులపాటు నిరసన తెలిపి పలు డిమాండ్లను సాధించుకున్న ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అధికారులు ఎలాంటి చర్యలు  తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు.  ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని , ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొత్తకొండ భాస్కర్, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోణాల గంగారెడ్డి , శ్రీకాంత్, ఓ బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్, చీకట్ల రాజు గజల, మహేష్, కిషన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం గోపాల్, కొండని గంగారం, బిజెపి నాయకులు పాశం భాస్కర్ రెడ్డి, సాయి కుమార్ , .సిద్ధార్థ, రాజు, అంజయ్య, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area