విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి…..

***ద్రావిడ బహుజన సమితి జిల్లా అధ్యక్షుడు అంబాల అనిల్……
టేకుమట్ల.జులై21(జనంసాక్షి)రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని
ద్రావిడ బహుజన సమితి జిల్లా అధ్యక్షుడు అంబాల అనిల్ అన్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ధర్నా,రాస్తారోకో నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని టేకుమట్ల మండలంలో ఉన్నటువంటి మూడవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న పేద  విద్యార్థులకు షెడ్యూల్ కులాల హాస్టల్ ని ఏర్పాటు చేయలని అన్నారు.విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు పెద్దయెత్తున ధర్నా రాస్తారోకోలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ద్రావిడ బహుజన సమితి జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు మహేష్,పుల్ల ప్రవీణ్,టేకుమట్ల మండల యూత్ ప్రెసిడెంట్ పాల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.