విద్యావ్యవస్థను నశానం చేశారు

మండిపడ్డ టిడిపి ఎమ్మెల్సీ అశోక్‌బాబు

అమరావతి,జూలై23(జనంసాక్షి): ఏపీలో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజమెత్తారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం టీచర్లపై కక్షసాధింపు చర్యలకు దిగిందని, ఇదే విషయాన్ని అన్ని సంఘాలు చెబుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల నుంచి ఈసారి సీఎం జగన్‌ కు కచ్చితంగా రిటర్న్‌ గిప్ట్‌ ఉంటుందని తెలిపారు. మెర్జింగ్‌తో వందల స్కూళ్లు మూలన పడుతున్నాయని, పీఆర్సీ పై ఉద్యమం చేసినందుకు టీచర్లను వేధిస్తున్నారని అశోక్‌బాబు మండిపడ్డారు
ముఖ్యమంత్రి జగన్‌?కు ఉద్యోగుల నుంచి ఈసారి కచ్ఛితంగా రిటర్న్‌? గిప్ట్‌ ఉంటుందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌ బాబు అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన మండిపడ్డారు. పీఆర్‌?సీపై ఉద్యోగ సంఘాలు చేసిన ఉద్యమం ముఖ్యమంత్రికి నచ్చలేదన్న అశోక్‌ బాబు.. దాన్ని దృష్టిలో పెట్టుకునే టీచర్లను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తరువాత నాశనమైన వ్యవస్థ.. విద్యా వ్యవస్థేనని అశోక్‌ బాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఉద్యోగుల నుంచి
ఈసారి కచ్ఛితంగా రిటర్న్‌ గిప్ట్‌ ఉంటుందని అన్నారు. నేషనలైజేషన్‌ ఆఫ్‌ స్కూల్స్‌ పేరుతో ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు తప్పుపడుతున్నారని చెప్పారు. ఇప్పటికే పాఠశాలల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు. విలీన ప్రతిపాదన వల్ల కొన్ని వందల పాఠశాలలు మూతపడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్‌సీపై ఉద్యోగ సంఘాలు చేసిన ఉద్యమం ముఖ్యమంత్రికి నచ్చలేదన్న అశోక్‌ బాబు..దాన్ని దృష్టిలో పెట్టుకునే టీచర్లను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.