విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు

నకిరేకల్‌: విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 65వ నెంబరు జాతాయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూయించారు. కార్యక్రమంలో సీపీఎం నేత నోముల నర్శింహయ్య , తెరాస పొలిట్‌ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్‌, తెదేపా జిల్లా అధికార ప్రతినిధి సోమయాదగిరి తదితరులు పాల్గొన్నారు.