విద్యుత్తు సర్‌ఛార్జీలకు నిరసనగా సీపీఎం జీపుజాత

ఖమ్మం వ్యవసాయం: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు సర్‌ఛార్జీలకు నిరసనగా సోమవారం ఖమ్మం పట్టణంలో వివిధ ప్రాంతాలలో సీపీఎం ఆధ్వర్యంలో జీపుజాత నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శనరావు నాయకత్వంలో ఇల్లెందు క్రాన్‌ రోడ్డు వ్యవసాయ మార్కెట్‌ గాంధీచౌక్‌ ప్రాంతాల్లో సభలు నిర్వహించి ఛార్జీల పెంపుపై ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులుపొన్నా వెంకటేశ్వరరావు ఎర్రా శ్రీకాంత్‌ పాల్గొన్నారు.