విద్యుత్‌ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. దానం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పేదలకు ఉచితంగా విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. అందులో భాగంగానే 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఛార్జీలే వసూలు చేయకూడదని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విపక్షాలు విద్యుత్‌ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. నగరంలోని  పంజాగుట్ట పరిధిలో ఇందిరమ్మ కలలు పేరుతో ఏర్పాటు చేసిన గ్రామసభలో మంత్రి పాల్గొన్నారు,