విద్యుత్‌ అధికారులను నిర్భందించిన గ్రామస్తులు

నల్గొండ: విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వెళ్లిన విద్యుత్‌ అధికారులకు తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వెళ్లిన అధికారులనుగ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో నిర్భందించారు. విద్యుత్‌ సక్రమంగా సరఫరా చేయకుండా బిల్లుల వసూళ్లకు రావడమేంటని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.