విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి…….

టేకుమట్ల.జులై21(జనంసాక్షి)టేకుమట్ల మండలంలోని దుబ్యాల గ్రామ శివారులో గురువారం విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందింది.బాధితుడు బిళ్ళకంటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం దుబ్యాల శివారు ప్రాంతాల్లో పంట పొలములో గడ్డి మేస్తు ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ తగిలి సుమారు  80,000వేల రూ.విలువ గల ఎద్దు మరణించడం జరిగిందని బాధితుడు తెలిపారు.
మాకు జీవనాధారమైన ఎద్దు మా కుటుంబ సభ్యులలో ఒకరిగా చూసుకునే మూగజివి మరణించిడంతో కుటుంబములో సభ్యున్ని కొల్పాయమని బాధితుడు తీవ్ర సోకసముద్రంలో మునిగిపోయారు.ప్రభుత్వం తరుపున ఆర్థిక సహయం అందించాలని అన్నారు.అనంతరం పశువుల వైద్యాధికారి డా.వివేక్ వచ్చి పంచనామా చేసి పోస్టుమార్టం నిర్వహించారు.తక్షణమే  ప్రభుత్వం ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ తిగలను సరి చూసుకోవాలని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు  సంగి రవి,సర్పంచ్ ఉమేందర్ రావు,విద్యుత్ అధికారులని కోరారు.