విధ్వంసంపై ఐ.రా.స. దృష్టి

మయన్మార్‌లో ఆధిపత్య వర్గాలు సృష్టిస్తోన్న విధ్వంసంపై ఐక్యరాజ్య సమితి దృష్టి సారించింది. ఉత్తర యాంగన్‌కు 340 మైళ్ల దూరంలోని రెహెంగ తెగకు చెందిన ముస్లింల ఇళ్లను ఆధిపత్య వర్గాలు ధ్వంసం చేయగా వాటి శిథిలాలను ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్‌ ప్రత్యేక సలహాదారు ఆదివారం పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి దాడులు, ధ్వంసాల గురించి తెలుసుకున్నారు. దీనిపై ఐ.రా.స.కు నివేదించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.