విషాదం పాముకాటుతో బాలుడి మృతి

రాజాపేట(నల్గొండ జిల్లా): రాజాపేట మండలం సోమారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నందకిషోర్(8) అనే బాలుడిని సోమవారం తెల్లవారుజామున పాము కాటేసింది. హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా..వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించమని సూచించారు. చికిత్సపొందుతూ కాసేపటికే బాలుడు మృతిచెందాడు.