విష జ్వరంతో బాలిక మృతి

కొత్తగూడ జూలై 21 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ గ్రామానికి చెందిన గట్ల భాస్కర్ రెండవ కుమార్తె తేజస్విని(9)విష జ్వరంతో మృతి.వివరాల్లోకి వెళ్ళగా తేజస్వినికి జ్వరం రావడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు పట్టణ ప్రాంతానికి తీసుకెళ్లడం జరిగింది.నర్సంపేట పట్టణం లోని ప్రైవేటు ఆసుపత్రి లో గత మూడు రోజులుగా చికిత్స చేయించడం జరిగింది.ఆ ఆస్పత్రి డాక్టర్ రక్త కణాలు బాగానే పెరిగాయని తెలిపారని కుటుంబీకులు అంటున్నారు.గడిచిన మూడు రోజుల తర్వాత ఈరోజు రక్తకణాలు మొత్తం పడిపోయాయని మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్ తెలిపారని అన్నారు.చికిత్స పొందుతున్న ఆస్పత్రి నుండి వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే ఈ పాప చనిపోయిందని వైద్యులు తెలుపడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తూ వైద్యుల నిర్లక్ష్యం వల్ల మా పాప చనిపోయిందని ఆవేదన వ్యక్తపరిచారు.