వి ఆర్ ఏ సమస్యలపై పట్టింపు లేని ప్రభుత్వం

సమ్మె 60వ రోజుకు చేరిన ప్రభుత్వం పట్టించుకోదా
సంఘ నాయకులు మెరుగు సమ్మయ్య
మహాదేవపూర్,సెప్టెంబర్ 22 (జనంసాక్షి )
మహదేవపూర్ మండల కేంద్రంలో గత కొద్ది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన దీక్ష చేస్తున్న విఆర్ ఏ లు నేటికి 60 వరోజులకు చేరింది.తమ డిమాండ్ల సాధన కోసం మహాదేవపూర్ లోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరవధిక నిరసన దీక్షా  చేపడుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి వీడి  తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు.గ్రామ రెవెన్యూ నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వన్ పే స్కేల్, అర్హులకు ప్రమోషన్లు, 55 సంవత్సరాలు నిండిన గ్రామ రెవెన్యూ సహాయకుల వారసులకు ఉద్యోగాలకు వెంటనే జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈనిరవధిక నిరసన సమ్మెలో  మెరుగు సమ్మయ్య,దాసరి బాలరాజు,జె ఏ సి నాయకుడు రాజబాబు.వెంకటేష్, సమ్మయ్య, లక్ష్మీ, మహేందర్,ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.