వీఆర్ఏలకు మద్దతు తెలిపిన ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు

కొత్తగూడ ఆగస్టు 9 జనం సాక్షి:కొత్తగూడ మండల కేంద్రంలో వీఆర్ఏల (15వ) రోజు నిరవధిక సమ్మె కు మద్దతు తెలిపిన ఎం ఆర్ పి ఎస్,అనంతరం ఎం ఆర్ పి ఎస్ జిల్లా కార్యదర్శి మిడతపల్లి యాకయ్య మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కెసిఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ జిల్లా ఉపాద్యాక్షులు ప్రేమ్ సాగర్,మండల వీఆర్ఏల అధ్యక్షుడు చెన్నూరు రవి,ఉపాధ్యక్షులు చెన్నూరి నర్సయ్య,ప్రధాన కార్యదర్శి అల్లం సాంబయ్య,కోశాధికారి చెన్నూరు సురేష్,దుర్గం రవీందర్,శ్రీలత,చంద్రయ్య,సత్యనారాయణ చెన్నూరి సుశీల,కళావతి,సమ్మక,నాగయ్య,పిట్టల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.