హత్యకు గురైన కానిస్టేబుల్‌ కుటుంబాన్ని పరామర్శించిన డీజీపీ

` అంకితభావంతో పనిచేసే పోలీసును కోల్పోయాం
` అన్ని విధాలా అండగా ఉంటాం: డీజీపీ శివధర్‌రెడ్డి
` పోలీసుల వద్ద ఆయుధాన్ని లాక్కుని రియాజ్‌ కాల్పులకు యత్నించాడు
` అతడి ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుగుతోంది
` ఆస్పత్రిలో గాయపడ్డ ఆసిఫ్‌కు పరామర్శ
నిజామాబాద్‌(జనంసాక్షి):ఇటీవల విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుమార్‌ కుటుంబానికి అండగా ఉంటామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లోని కానిస్టేబుల్‌ ఇంటికి వచ్చిన డీజీపీ, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పలువురు ఉన్నతాధికారులు.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విూడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే ఒక మంచి కానిస్టేబుల్‌ను కోల్పోయామన్నారు. ఇది పోలీస్‌ శాఖను తీవ్రకలవరానికి గురి చేసిందన్నారు. రియాజ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై విచారణ జరుగుతోంది. విచారణ జరుగుతున్నప్పుడు కేసు గురించి మాట్లాడితే దర్యాప్తు అధికారిని ప్రభావితం చేసినట్లు అవుతుంది. ప్రమోద్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం, సెప్టెంబరు నెల వేతనం ఎంత తీసుకున్నారో ఆ మొత్తాన్ని పదవీ విరమణ తేదీ వరకు ప్రతినెలా ఆయన కుటుంబానికి అందించాలని, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పోలీసు భద్రత, వెల్ఫేర్‌ బోర్డుల నుంచి రూ.24 లక్షల పరిహారం, పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. నిజామాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడు రౌడీషీటర్‌ రియాజ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, అతన్ని పట్టుకునే క్రమంలో మరొక యువకుడు ఆసిఫ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసిఫ్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండగా, ఆయన సాహసాన్ని ప్రశంసిస్తూ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మంగళవారం నాంపల్లిలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో ఆయనను పరామర్శించారు.ఆసుపత్రిలో ఆసిఫ్‌ను కలసిన డీజీపీ శివధర్‌రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి ఆరా తీశారు. డాక్టర్లు వివరించిన ప్రకారం ఆసిఫ్‌పై సర్జరీ పూర్తయిందని, ప్రస్తుతం ఆయన చేతి నరాలను సవ్యంగా కలిపి సాధారణ స్థితికి తీసుకురావడానికి చికిత్స కొనసాగుతున్నదని తెలిపారు. ఆసిఫ్‌ పరిస్థితి స్థిరంగా ఉందని డీజీపీ వెల్లడిరచారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన డీజీపీ శివధర్‌రెడ్డి, ఆసిఫ్‌ చాలా ధైర్యంగా, నిజమైన పోలీసు స్ఫూర్తితో వ్యవహరించాడు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఆయన చూపిన సాహసం ప్రశంసనీయం. ఆయన వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు, ఆసిఫ్‌ ధైర్యాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గ్యాలంట్రీ మెడల్‌ కోసం సిఫార్సు చేస్తామని తెలిపారు. నిందితుడు రియాజ్‌ చేసిన దాడిలో ఆసిఫ్‌ రెండు చేతులకు లోతైన కత్తిగాట్లు అయ్యాయి. చేతి నరాలు కోసుకు పోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. మొదట స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం మల్లారెడ్డి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. డాక్టర్లు ఆసిఫ్‌పై సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, కొద్ది వారాల్లో ఆయన కోలుకుంటారని తెలిపారు. గత వారం జరిగిన ఈ ఘటనలో రౌడీషీటర్‌ రియాజ్‌ను నిజామాబాద్‌ పోలీసులు అక్టోబర్‌ 17న అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో అతను సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాల కారణంగా కానిస్టేబుల్‌ ప్రమోద్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర పోలీస్‌ శాఖ, నిందితుడిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. చివరికి రియాజ్‌ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్‌ ధైర్యంగా ఎదుర్కొని తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం రియాజ్‌ను పట్టుకొని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్‌ మరోసారి పోలీసులు పై దాడికి పాల్పడి ఆయుధాలు లాక్కునేందుకు యత్నించాడు. ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత పోలీస్‌ శాఖలో ఆసిఫ్‌ సాహసానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సాధారణ వ్యక్తి అయినా పోలీసుల మాదిరిగా ప్రమాదంలో పాల్గొని నిందితుడిని పట్టుకునేందుకు సాహసం చేసినందుకు ఆయనను రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నట్లుగా, ఆసిఫ్‌ సాహసాన్ని గుర్తించి గ్యాలంట్రీ అవార్డుకు సిఫార్సు చేయడం ద్వారా ఆయనకు తగిన గౌరవం అందించనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు లొంగిపోవాలని ఇప్పటికే సీఎం సూచించారు. తెలంగాణ నుంచి ఇంకా దాదాపు 65 మంది మావోయిస్టులు యాక్టివ్‌గా ఉన్నారు. వారిపై ఉన్న కేసుల విషయంలో సానుభూతితోనే వ్యవహరిస్తాం, ఎలాంటి వేధింపులు ఉండవని డీజీపీ తెలిపారు.
రియాజ్‌ పోలీసుల వద్ద ఆయుధాన్ని లాక్కుని కాల్పులకు యత్నించాడు: డీజీపీ శివధర్‌రెడ్డి
నిజామాబాద్‌లో పోలీసుల కాల్పుల్లో నిందితుడు రియాజ్‌ మృతిచెందిన ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. రియాజ్‌ తప్పించుకుని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి పాల్పడ్డాడని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు.. బాత్‌రూంకు వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడినట్లు తెలిపారు. ‘‘రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. వారి దగ్గరున్న ఆయుధాన్ని లాక్కుని కాల్పులకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్‌ చనిపోయాడు. ఆదివారం అతడిని పట్టుకునే క్రమంలో స్థానికుడు ఆసిఫ్‌పై దాడి చేశాడు. ఇవాళ మరో కానిస్టేబుల్‌ను గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడు’’ అని డీజీపీ వెల్లడిరచారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో కాల్పులు: సిపి సాయిచైతన్య
గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య స్పష్టం చేశారు. పోలీసులపై దాడి క్రమంలో ఈ ఘటన జరిగిందన్నారు. రియాజ్‌ మృతి గురించి సీపీ సాయి చైతన్య వివరాలను వెల్లడిరచారు. ఉదయం ఆసుపత్రిలో నిందితుడు రియాజ్‌ గొడవ చేశాడు. ఆసుపత్రిలో అద్దం పగలకొట్టి అందరిపై తిరగబడ్డాడు. విధుల్లో ఉన్న ఆసుపత్రి సిబ్బంది, పోలీసులపై రియాజ్‌ తిరగబడ్డాడు. గోల చేస్తున్న రియాజ్‌ను బెడ్‌పై పడుకోబెట్టే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్‌ దగ్గరున్న తుపాకీ లాక్కుని ట్రిగ్గర్‌ నొక్కే ప్రయత్నం చేశాడు. తుపాకీ కింద పడేయాలని ఆర్‌ఐ హెచ్చరించినా రియాజ్‌ వినలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రియాజ్‌పై ఆర్‌ఐ కాల్పులు జరిపారు. ఆర్‌ఐ కాల్పులు జరపగానే రియాజ్‌ నేలపై పడిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నాం అని సాయి చైతన్య తెలిపారు. రియాజ్‌ తిరుగుబాటు తత్వానికి కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్యే నిదర్శనమన్నారు. అతను మామూలు నేరస్థుడు కాదన్నారు.