వీఆర్ఏలకు సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలి…

– 12వ రోజుకు చేరిన నిలవధిక సమ్మె.
– మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య.
ఊరుకొండ, ఆగస్టు 5 (జనం సాక్షి):
వీఆర్ఏలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హామీలు అన్ని నెరవేరేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఊరుకొండ మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం వీఆర్ఏల 12 వ రోజు నిరసన దీక్షలో భాగంగా మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ సత్తయ్య మాట్లాడుతూ వీఆర్ఏ లకు పే స్కేల్ జీవోను వెంటనే చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని వివిధ డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ స్థాపించారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ B. సత్తయ్య కో చైర్మన్ B. రమేష్ జెర్నల్ సెక్రటరీ A. శేఖర్, కన్వినర్ B. శ్రీలత కో కన్వినర్ లు సుల్తాన్. జంగయ్య, దశరథం. యాదయ్య, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.