వీఆర్ఏల డిమాండ్లు నెరవేర్చేలా చూడాలని…

తహాసిల్దార్ కు రాఖీ కట్టిన వీఆర్ఏలు….
– 19వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె.
– మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య.
ఊరుకొండ, ఆగస్టు 12 (జనం సాక్షి):
వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లు… ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఊరుకొండ తహాసిల్దార్ జాకిర్ అలికి, రెవెన్యూ సిబ్బందికి వీఆర్ఏలు రాఖీలు కట్టీ వినూతన రీతిలో నిరసన వ్యక్తం చేసినట్లు మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య తెలిపారు. శుక్రవారం 19వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలపడంతో పాటు తమకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేసేలా చూడాలని విన్నపించారు. ఈ సందర్భంగా ఊరుకొండ మండల వీఆర్ఏ జేఏసి చైర్మన్ సత్తయ్య మాట్లాడుతూ… వీఆర్ఏ లకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ. సత్తయ్య, కో చైర్మన్ బీ.రమేష్ , జెర్నల్ సెక్రటరీ శేఖర్, కన్వినర్ బీ.శ్రీలత, కో కన్వినర్ లు సుల్తాన్. జంగయ్య, దశరథం. యాదయ్య, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

12యుకే01, 19వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా తహాసిల్దార్ కు రాఖీ కడుతున్న ఊరుకొండ మండల వీఆర్ఏలు.