వీఆర్ఏల నిరవధిక సమ్మె నేటికీ 36వ రోజు కావడంతో ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేయడం జరిగింది

, గాంధారి జనంసాక్షి ఆగస్టు 29
వీఆర్ఏల నిరవధిక సమ్మె సోమవారం నాటికి 36వ రోజు ఉదయంతో  గాంధారి మండలానికి విచ్చేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ కు వీఆర్ఏలు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీల కనుగుణంగా జీవోలు విడుదల చేయించాలని ఎమ్మెల్యేని వారు కోరారు. నిరవధిక సమ్మె ప్రారంభించి ఇప్పటికే 36 రోజులు గడుస్తున్నాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ పేస్కేల్ ను అమలు చేస్తూ జీవోలు జారీ చేయాలని వారు కోరారు. అంతేకాకుండా అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలని, 55 ఏళ్లు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు నూతి భూమయ్య, ప్రధాన కార్యదర్శి గైని సాయిలు, కిషన్ వీఆర్ఏలు పాల్గొన్నారు.