వేతనాలు పెంచాలని ఆందోళన
పుడూరు: గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న రోజువారీ కార్మికులకు వేతనాలు పెంచాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం వుడూరు మండల కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు రవి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.