వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

పౌండర్ వేములపల్లి రాజు
జనం సాక్షి, చెన్నరావు పేట

చెన్నారావుపేట- నర్సంపేట ప్రధాన రహదారిపై పాత ముగ్దుంపురం గ్రామంలో వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించటం జరుగుతున్నదనీ పౌండర్ వేములపల్లి రాజు ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌరసరఫరాలు- బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ , గౌరవ అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరవుతున్నారనీ, ప్రయాణికులు, గ్రామ ప్రజలు తప్పకుండా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.