వైకుంఠధామం, క్రీడా ప్రాంగణంను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్..

కామారెడ్డి రూరల్ జూన్3(జనంసాక్షి);
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవుని పల్లి లో వైకుంఠధామం, క్రీడా ప్రాంగణంను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తుందని సూచించారు. పట్టణాల్లో పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.