శంషాబాద్‌లో పోలియో వ్యాక్సిన్ ప్రారంభం

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌లో పోలియో వ్యాక్సిన్‌ను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐదు నెలల పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. మూడు నెలల్లో 48 పీహెచ్‌సీలు, 12 అర్బన్ హెల్త్ సెంటర్లకు కొత్త పరికరాలు అందిస్తామని తెలిపారు.