శక్తివంతుల జాబితాలో సోనియా, మన్మోహన్‌తో పాటు కేసీఆర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : ఇండియాటుడే పత్రిక విడుదల చేసిన భారతదేశంలో అత్యంత శక్తి వంతుల జాబితాలో టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుకు చోటు దక్కింది. శక్తివంతుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు వ్యక్తులకు మాత్రమే చోటు దక్కింది. తెలంగాణ ఉద్యమాన్ని హోరెత్తించిన కేసీఆర్‌కు పది జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్టు ఇండియాటుడే పేర్కొంది. అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్న వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి కూడా ఈ జాబితాలో చోటు దక్కింది.