శరవేగంగా పట్టణ ప్రగతి పనులు. . పట్టణ ప్రగతి పనులు పర్యవేక్షిస్తున్న మున్సిపల్ చైర్మన్. మునిసిపల్ కమిషనర్ 

ఎల్లారెడ్డి 07  జూన్  (జనంసాక్షి )  ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో మంగళవారం ఉదయం నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసినట్లు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తెలిపారు పట్టణ ప్రగతి లో నిర్వహిస్తున్న పనుల  తీరుపై  పలు వార్డులలో పర్యటించారు  పట్టణ ప్రగతి లో కాలనీవాసులు  చెర్మెన్ కు  ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన చైర్మన్  కూడుముల సత్యం విద్యుత్ అధికారులతో అక్కడికి చేరుకొని  వారితో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి పాత వాటిని తొలగించారు  పలు కాలనీలలో చాలా సంవత్సరాల క్రితం వేసిన ఐరన్ విద్యుత్ స్తంభాలు ఉండడం వల్ల వర్షాకాలంలో స్తంభాలకు విద్యుత్ షాక్ వస్తుండడంతో పట్టణంలో ఉన్న అన్ని విద్యుత్ ఐరన్ స్తంభాలు తొలగిస్తామని పట్టణ ప్రజలు తో  అన్నారు త్వరలోనే మరికొన్ని నూతన స్తంభాలు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్మన్ సత్యం తెలిపారు  అవసరం. ఉన్నచోట  నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్మన్ తెలిపారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జీవన్  పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారి  వాసంతి. టిఆర్ఎస్ పట్టణ అధికార ప్రతినిధి రామప్ప. టిఆర్ఎస్ నాయకులు నారాయణ. కృష్ణమూర్తి.  భాస్కర్ . సాయిలు వెంకటేశం. విద్యుత్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది.  కాలనీవాసులు తదితరులు ఉన్నారు