శాంతిఖని గనిలో క్విజ్ పోటీలు.

బెల్లంపల్లి, నవంబర్15, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని శాంతి ఖని గనిలో మంగళవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. శాంతిఖని గనిలో బొగ్గు నాణ్యత వారోత్సవాల సందర్భంగా గని ఉద్యోగులకు ఈ పోటీలు నిర్వహించారు. . ఈ క్విజ్ పోటీల్లో బొగ్గు నాణ్యతకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి గెలుపొందిన జె సాగర్, ఎస్ రాజేష్, ఎస్ రంజిత్ లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ ఇంచార్జి ఎండి ముస్తఫా, ఫిట్ ఇంజనీర్ రాంబాబు, వెంటిలేషన్ అధికారి పూర్ణ చందర్, ఇంజనీర్ రామ్ సాగర్, సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, టీబీజీకెఎస్ ఫిట్ సెక్రటరీ దాసరి శ్రీనివాస్, ఏఐటీయూసి ఫిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్, గని అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.