శాంతినగర్ పాఠశాలకు బెంచీలను వితరణ చేసిన సర్పంచ్ రాజేందర్

టేకులపల్లి,నవంబర్ 15( జనం సాక్షి): మండలంలోని ముత్యాలంపాడు ఎక్స్ రోడ్ గ్రామపంచాయతీలో శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలకు బెంచీలను, విద్యార్థులకు ఐడి కార్డులను మద్రాస్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్, దిశా కమిటీ జిల్లా సభ్యులు, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు మాలోతు రాజేందర్ నాయక్ మంగళవారం పాఠశాలలో అందజేశారు. శాంతినగర్ పాఠశాల విద్యార్థుల యొక్క ప్రజ్ఞ శక్తిని, వారిలో ఉన్న క్రమశిక్షణకు, ప్రశ్నలకు సమాధానాలు తెలిపిన విద్యార్థుల పట్ల ప్రైవేటు స్కూల్లో చదివే విద్యార్థి కూడా చెప్పలేని విధంగా అంతకంటే ఎక్కువ రైమ్స్, పోయెమ్, టేబుల్స్ చెప్తూ ఉండడంతో పాఠశాల వాతావరణం, విద్యార్థుల నైపుణ్యాన్ని తనను ఆకట్టుకోవడంతో స్పందించిన రాజేందర్ పాఠశాలకు తాను అందించిన బెంచీలతోపాటు పాఠశాలకు ఎలాంటి అవసరాలైన తన వంతు సహాయం చేయడానికి ముందు ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ రామ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆయన చేతుల మీదగా పాఠశాల అధ్యాపక బృందం, పిల్లల సమీక్షంలో బెంచీలను, విద్యార్థులకు ఐడి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ చేతుల భద్రయ్య, సుజాతనగర్ మండల అధ్యక్షులు బానోత్ అనిల్ నాయక్, స్థానిక వార్డు సభ్యులు రాము నాయక్,స్కూల్ టీచర్ రమేష్,లోక్య అంగన్వాడీ టీచర్స్ తదితర నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు