శాకాంబరి అవతారంలో దర్శనమిచ్చిన బతుకమ్మ కుంట దుర్గమ్మ ..

జనగామ (జనం సాక్షి)జూలై22: జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట శ్రీ శ్రీ దుర్గాదేవి దేవాలయం లో అమ్మ వారికి శాకాంబరి అవతారం అనగా వివిధ కూరగాయల తో అలంకరణ చేసి భక్తులకు శాకాంబరీ అవతారాంలో దర్శన భాగ్యం కలిగించిన దేవాలయ కమిటీ ,ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు రాజలింగారాధ్య మాట్లాడుతూ జనగామ ప్రజలు అందరు వచ్చి అమ్మ వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ వారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపినారు .భక్తులకు ఇబ్బంది కాకుండా పూజారి రాజలింగారాధ్య తన స్వంత డబ్బులతో గ్రిల్స్ వేయించారు. దేవాలయ కమిటీకి భక్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపినారు.