*శివ గణేష్ యూత్ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం*

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.మండలంలోని దిర్శించర్ల గ్రామం దుబ్బల మీద శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేతిరెడ్డి ప్రదీప్ రెడ్డి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నదానం కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించిందని సుమారు వెయ్యి మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనగా ప్రశాంత వాతావరణంలో భక్తులకు యూత్ సభ్యులు అన్నప్రసాదాన్ని అందించార న్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారెడ్డి ఫౌండేషన్ అధినేత  జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి కురుకుంట్ల వసంత రెడ్డి, శ్రీను, మహేష్ సతీష్, శివ,మరియు గణేష్ యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.