*శోభనాద్రిపురంలో అక్రమంగా మట్టి దందా*

 

ప్రభుత్వ భూమిలో ఏదేచ్ఛగా అక్రమ మట్టి రవాణా.!
మట్టి రవాణా కొనసాగిస్తున్న సర్పంచ్ భర్త.!
వి అర్ ఏ ను కులం పేరుతో దూషించిన సర్పంచ్ భర్త.
సర్పంచ్ భర్త పై చర్యలు తీసుకోవాలని వీఆర్ఏ డిమాండ్.
రామన్నపేట అక్టోబర్ 23 (జనంసాక్షి)
 రామన్నపేట మండల పరిధిలోని శోభనాద్రిపురం గ్రామంలో ఆదివారం యదేచ్చగా అక్రమంగా మట్టిదంధా  కొనసాగుతుంది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తరలిస్తున్న సమాచారం మేరకు వీఆర్ఏ ధనమ్మ మట్టి ట్రాక్టర్ లను అడ్డుకోగా సర్పంచ్ భర్త కాల్య శ్రవణ్ కుమార్ కులం పేరుతో దూషిస్తూ నీ సంగతి చూస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దాంతో వి అర్ ఓ ధనమ్మ తనను కులం పేరుతో దూషించిన కాల్య శ్రవణ్ కుమార్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మీడియా ముందు తమ గోడును వెలిబుచ్చారు.