శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

చిలుకూరు: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చిలుకూరు మండల కేంద్రంలో శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డ నారాయణరావు, మండల తహశీల్దార్‌ ఎన్‌. సూర్యనారాయణ ఈ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. యువకులు క్రీడాస్ఫూర్తితో ఆటల్లో ప్రతిభ చూపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు సహకార సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.