శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి, ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌, (మార్చి 28) : శ్రీరామ నవమి వేడుకలు వాడవాడలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండితులు, పామరులు అనే తేడా లేకుండా భక్తులందరూ దేవాలయాలకు వెళ్లి సీతారాములను దర్శించుకుంటున్నారు. జిల్లాలోని  వంగూరు మండలం శిరిసనగండ్లలో  జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు పాల్గొన్నారు.