శ్రీశైలంకు జలకళ!

కర్నూలు, ఆగస్టు 14 : శ్రీశైలం రిజర్వాయరు కళకళలాడుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండింది. ఆ ప్రాజెక్టు గేట్లు అన్నింటిని ఎత్తివేశారు. ఆ వరద నీరు శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతోంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 808.80 అడుగులు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు అన్న విషయం తెలిసిందే. జలాశయం ఇన్‌ఫ్లో 72,890 క్యూసెక్కులుగా ఉంది.