శ్రీ దుర్గామాతను దర్శించుకున్న చైర్ పర్సన్: కొప్పుల స్నేహలత

ధర్మపురి అక్టోబర్ 2 ( జనం సాక్షి న్యూస్ ) శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం ఉదయం ధర్మపురి పట్టణ కేంద్రంలో న్యూ టీటీడీ ఫంక్షన్ హాల్ లో నవదుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో కొలువు తీరిన శ్రీ దుర్గ అమ్మవారిని,ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత తో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన, అనంతరం చైర్ పర్సన్ స్నేహలత మాట్లాడుతూ, ధర్మపురి నియోజకవర్గ ప్రజలు అందరూ అమ్మవారి కృపతో సుఖ శాంతులతో ఉండాలని శ్రీ దుర్గా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో దేవి అంజలి, స్తంభంకాడి మహేష్, ప్రవీణ్,గడ్డం బాలరాజ్,టిఆర్ఎస్ నాయకులు మహిళా సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.