శ్రీ సాయిరాం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

గణపురం (ము)సెప్టెంబర్ 6 జనం సాక్షి : గణపురం మండల కేంద్రంలోని ఐ బి గెస్ట్ హౌస్ రోడ్డులో గల శ్రీ సాయిరాం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బానోత్ రమ రాజు నాయక్ అన్నదాన కార్యక్రమం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ నారా గాని దేవేందర్ గౌడ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని పురవీధులలో భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాలను ఏర్పాటు  చేసుకొని గణపతి నవరాత్రి పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించి ఎన్నో రకాల వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అన్ని దానాలలో అన్నదానం మిన్న అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం లో  కాలనీవాసులు,  గ్రామ ప్రజలతో  పాటు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, పిల్లలు ,పెద్దలు ,అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మోట పోతుల

శివశంకర్ గౌడ్, గణపురం పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పోల్సాని లక్ష్మీనరసింహారావు, పిఎసిఎస్ డైరెక్టర్ గుర్రం సురేష్ గౌడ్, విగ్రహ దాత మోత్కూరి సాయికుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు బూర రాజగోపాల్ గౌడ్ ,సాయికుమార్, గుర్రం నిఖిల్, పాలకు ర్తి వికాస్ ,గుర్రం నరసింహ స్వామి ,తదితరు లు పాల్గొన్నారు.