షర్మిల దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్థులు

మహబూబ్‌నగర్‌: రాజన్న రాజ్యం కావాలని పాదయాత్ర చేస్తున్న షర్మిలను తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు తేల్చి చెప్పారు. తెలంగాణలోకి ప్రవేశించే ముందు  తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. వర్సిటీ ముందు రహదారిపై షర్మిల దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ధర్నాకు దిగారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.