సభ్యత్వ నమోదుకు కృషిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తాం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్

మోమిన్ పేట అక్టోబర్ 1 జనం సాక్షి
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకు కృషిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు శనివారం మండల కేంద్రంలోని సూపర్ డీలక్స్ కళ్యాణ మండపంలో బూత్ స్థాయి సభ్యత్వ ఇన్చార్జి లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ బిజెపి ల రాచకాలకు అవినీతి అక్రమాలకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు వికారాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే మోమిన్ పేట మండలం అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయించిన పార్టీ సీనియర్ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి వారిని గుర్తింపు ఇస్తామని అన్నారు వికారాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం కోసం ప్రతి కార్యకర్త వీర సైనికుని వలె పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నే శంకర్ యాదవ్ నియోజకవర్గ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ కిషన్ నాయక్ మైపాల్ రెడ్డి ఎర్రవల్లి జాఫర్ రఘుపతి రెడ్డి ఎండి సిరాజుద్దీన్ సుభాష్ గౌడ్ సురేందర్ నర్సింలు మహేందర్ రెడ్డి ఆయా గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు