సమస్యలు కలెక్టర్ దృష్టికి – ఎంపీటీసీ వేముల భారతి

అశ్వారావుపేట పట్టణం లో బుధవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా పర్యటించారు.అశ్వారావుపేట పట్టణ స్థానిక ఎంపీటీసీ వేముల భారతి పలు ప్రజా సమస్య లపై వినతి పత్రం అందజేశారు. ఇటీవల కాలంలో గురుకుల విద్యాలయాల్లో ఆడపిల్లలపై జరిగిన అత్యాచారలను మరియు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు సైతం ప్రదర్శిస్తున్న దురుసు ప్రవర్తనను సైతం పత్రిక లలో ప్రచు రితమైన వార్త కథనాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వారికీ సరైన రక్షణ సదుపాయాలు కల్పించాలని కోరారు, అలాగే ప్రభుత్వం చేపట్టే అనేక అభివృద్ధి కార్యక్రమాలలో సైతం అవినీతి కి అడ్డాగా అశ్వారావుపేట నిలుస్తుండడం దురదృష్టకరమని ఆ ఆరోపణలై సమగ్ర విచారణ చేయించి అభివృద్ధికి తోడ్పాడాల్సిందిగ ఆ లేఖలో పేర్కొన్నారు. జిల్లా లో వున్న ప్రధాన పట్టణలైన కొత్తగూడెం భద్రాచలం మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రులలో వున్నటు వంటి ఆరోగ్య సదుపాయాలు అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలని వేముల భారతి జిల్లా కలెక్టర్ అందీప్ కి విన్నవించుకున్నారు.