సర్కారు బడికి పిల్లల్ని పంపండి

` కార్పొరేట్‌ విద్య అందిస్తాం
` మౌళిక సదుపాయాలు కల్పిస్తాం
` టీచర్లే మా బ్రాండ్‌ అంబాసిడర్లు
` తెలంగాణ సాధనలో వారి పాత్ర కీలకం
` 25వేలమందికి పదోన్నతులు కల్పించాం
` ఒకటో తేదీన జీతాలు పడేలా చేస్తున్నాం
` పేదల చదువుతోనే తెలంగాణకు భాగ్యం
` సర్కారీ బడికి వెళ్లడం ఆత్మగౌరవంగా భావించాలి
` ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో భేటీలో సీఎం రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ భవిష్యత్‌ ఎక్కడుందని ఈ క్షణం తనను అడిగితే వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతానని ఉద్ఘాటించారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నాడు 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఉపాధ్యాయులే తమ ప్రభుత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 25వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 30 వేల మందిని బదిలీ చేశాం. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు విూ ఖాతాలో పడేలా చూసే బాధ్యత మాది. ఈ సమ్మేళనంలో రాజకీయం, స్వప్రయోజనం లేదు. తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని అన్నారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవం అని తల్లిదండ్రులు భావించాలి. అందుకు అందరం కలిసి కృషి చేయాలి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తాం. పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ ఇస్తాం.. ఆ బిల్లు ప్రభుత్వమే చెల్లిస్తుంది. పేద పిల్లలు, దళిత వర్గాల పిల్లలు చదువుకుని బాగు పడితేనే రాష్ట్రం బలపడుతుంది. దిల్లీలో మూడుసార్లు కేజీవ్రాల్‌ గెలిచింది బస్తీల్లో పాఠశాలలు మెరుగుపరచడం వల్లే. మళ్లీ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉండాలంటే విూరు పేదలకు చదువు చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని తాను ఈ స్థాయికి వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థులు ఉన్నారని… తల్లిదండ్రులు వారి భవిష్యత్‌ను ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టారని వివరించారు. రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నామని చెప్పారు. కోదండరాం, హరగోపాల్‌, చుక్కా రామయ్య లాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందని అనుకున్నామని కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశామని అన్నారు. గత పాలకులు ఉపాధ్యాయు లను ఏ విధంగా అవమానించారో చూశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్‌లో విద్యకు 10శాతం కేటాయించాలని భావించాం. కానీ హావిూల అమలు దృష్ట్యా 7.3శాతం అంటే రూ.21వేల కోట్లకు పైగా కేటాయించాం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30వేల పాఠశాలల్లో.. 26లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు..10వేల ప్రైవేట్‌ పాఠశాలల్లో.. 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో విూకంటే గొప్ప టీచర్లున్నారా? మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉంది.. ఇది కఠోర నిజం. టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. పదిహేనేళ్లుగా పెండిరగ్‌లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించాం. విూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ భవిష్యత్‌ మా చేతుల్లో కాదు..విూ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమావేశం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా. అలాంటి ప్రభుత్వ టీచర్లను కలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమావేశం. టీచర్లంతా 90శాతం పైగా నిబద్ధతతో పనిచేయాలి.. విద్యార్థులకు విద్యనందించాలి. గత ఏడాదికంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలకు పైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవమని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వం వైపు నుంచి విూ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యుత్‌ అందించాలని అధికారులను ఆదేశించాం. తెలంగాణ బలపడాలి అంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలని అన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. గ్రావిూణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోంది. అందుకే ముచ్చర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. స్కిల్‌ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్‌ పాలసీని తీసుకొస్తాం. విూరు నేర్పే విద్యనే రేపటి తెలంగాణ భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే విూ లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.