సల్ల రవీందర్ ను పరామర్శించిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి

తిమ్మాపూర్, అక్టోబర్ 15 (జనం సాక్షి): మానకొండూర్ నియోజకవర్గం అల్గునూర్ 8వ, డివిజన్ కార్పొరేటర్ సల్ల శారధ భర్త మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు సల్ల రవీందర్ కి ఇటీవల గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్ లో చేర్పించారు.
రవీందర్ చికిత్స పొంది రావడంతో ఈరోజు గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల రమేష్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి స్వామి రెడ్డి, మల్లారెడ్డి, గుండ్ర రాజయ్య, అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.