సింగరేణి నిర్వాసితులకు పరిహారం పంపిణీ

కమాన్‌పూర్‌: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌-3 విస్తరణలో భాగంగా విలీనమైన పెద్దం పేట గ్రామ పంచాయితీ పరిధిలోని మంగంపల్లి నిర్వాసితులకు రూ. 13.77 కోట్ల నష్టపరిహారం చెక్కులను మంత్రి శ్రీధర్‌బాబు ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.