స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు

` కావాల్సిన యంత్రాంగం ఉంది
` సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు వెళతాం
` తెలంగాణలో శాంతి భద్రతలకు పెద్దపీట
` ఖాళీల భర్తీని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతా
` నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నూతన డిజిపిగా బాధ్తయలు స్వీకరించిన శివధర్‌ రెడ్డి తెలిపారు. మాకు బలమైన జట్టు ఉంది. క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటాం అన్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని నూతన డీజీపీ శివధర్‌ రెడ్డి తెలిపారు. నూతన డీజీపీగా ఆయన లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రాలతో డీజీపీ కార్యాలయంలోకి ఆయన్ను పండితులు ఆహ్వానించారు. తెలంగాణ 6వ డీజీపీగా 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి శివధర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విూడియా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ డీజీపీగా అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విూడియాతో మాట్లాడారు. పోరాట మార్గం వీడేందుకు సిద్ధమని ఇటీవల నక్సల్స్‌ నేత లేఖ రాశారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని వారిని కోరుతున్నాం. మావోయిస్టుల సిద్దాంతాలు ఆచరణలో విఫలమయ్యాయని భావిస్తున్నాం. లొంగిపోయిన వారికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. రాష్ట్రంలో పోలీసుస్టేషన్ల సంఖ్య కంటే పోలీసుల్లో నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. పోలీసు శాఖ ప్రత్యేక విభాగాల్లోని ఖాళీలను నిపుణులతో భర్తీ చేస్తాం అని డీజీపీ తెలిపారు. తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడం మా మొదటి కర్తవ్యం. తెలంగాణ అభివృధికి, పెట్టుబడులు రాకకు లా అండ్‌ ఆర్డర్‌ ఎంతగానో దోహదపడుతుంది. మా ముందు ఉన్న లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించడం. విూడియా సహకారం చాలా అవసరం. పోలీస్‌ శాఖలో 17 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడండి. మావోయిస్టులపై నమోదు అయిన కేసులు విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తా. మావోయిస్టుపై వేధింపులు ఉండవు. ప్రభుత్యం ముందు విూరు ఆత్మసమర్పణ చేసుకోండి, ముందుకు రండి. మావోయిస్టు పార్టీ నుండి బయటికి రండి. మావోయిస్టు పొలిట్‌ బ్యూరో సుజాత ఇటీవలే మావోయిస్టు పార్టీని వీడారు. వేణుగోపాల్‌ ఇచిన స్టేట్మెంట్‌ జగన్‌ ఖండిరచారు. మావోయిస్ట్‌ నేత జగన్‌ ఇచిన స్టేట్మెంట్‌ అందరూ చూసాం. వీరి మధ్యలో సమస్యలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం మావోయిస్టులకు అందించాల్సిన బెనిఫిట్స్‌ అందిస్తాం. సైబర్‌ కైమ్ర్‌ నేరాలు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. పోలీస్‌ సిబ్బంది స్కిల్స్‌ పెంచుతాం. బేసిక్‌ పోలింగ్‌ అండ్‌ విజువల్‌ పోలీసింగ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ఇంప్రూవ్‌ చేస్తాము’ అని కొత్త డీజీపీ శివధర్‌ రెడ్డి చెప్పారు.