సిపిఐ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

పినపాక నియోజకవర్గం జూలై 24 (జనం సాక్షి):

మణుగూరు సిపిఐ ఆధ్వర్యంలో టీ కొత్తగూడెం వరద బాధితులకు ఆదివారం సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య చారి చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి పెరిగి పినపాక నియోజకవర్గంలోని పలు మండలాలైన మణుగూరు, అశ్వాపురం,పినపాక, బూర్గంపాడులోని పలు గ్రామాల్లో ఇండ్లు నీటమునిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని బి అయోధ్య డిమాండ్ చేశారు. పాక్షికంగా ఆస్తి నష్టం జరిగిన బాధితులను ఆర్థికంగా ఆదుకోవాలి. వరదల వల్ల పూర్తిగా నష్టపోయిన వారికి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా సమైఖ్య జిల్లా కార్యదర్శి, మున్నా లక్ష్మికుమారి,,సీపీఐ నియోజకవర్గ వర్గ కార్యదర్శి సరెడ్డి పుల్లారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు అర్ లక్ష్మీనారాయణ, సీపీఐ మండల,పట్టణ కార్యదర్శి జంగం మోహనరావు,దూర్గ్యల సుధాకర్,మాజీ మండల కార్యదటీషి ఎస్ కే సర్వర్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి అక్కినర్సింహారావు, గిరిజన సంఘము జిల్లా నాయకులు సొంధే కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.