సిపిఐ జిల్లా కమిటీ ఎన్నిక పట్ల హర్షం

మల్దకల్ ఆగస్టు 29 (జనంసాక్షి) అలంపూర్ లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా రెండవ మహాసభలల్లో జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు, మల్దకల్ మండలానికి చెందిన ఎల్కూర్ రంగన్న ను జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోవడం పట్ల మల్దకల్ మండలసీపీఐ నాయకులు విఠలాపురం చెన్నయ్య, శేఖర్ ,రంగస్వామి, మల్లికార్జున్,ఆంజనేయులు, పరశురాముడు, మల్దకలప్రజలు హర్షం వ్యక్తం చేశారు.మల్దకల్ మండలానికి చెందిన ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగన్న ను జిల్లా కౌన్సిల్ లోకి తీసుకోవడం ప్రజా ఉద్యమాలకు, కార్మికుల, అణగారిన వర్గాలకు ఉద్యమించే విధంగా మంచి  పరిణామం అని వారు తెలిపారు.