సిపిఐ మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు అరెస్ట్.

 

వెంకటాపురం నూగురు,జూలై 26(జనంసాక్షి):-. సిపిఐ మావోయిస్టు పార్టీ వాజేడు, వెంకటాపురం భారత కమ్యూనిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సానుభూతి పరులను అరెస్ట్ చేసిన వెంకటాపురం పోలీసులు. కొండాపురం నుంచి అలుబాక వైపుకు మావోయిస్టు పార్టీకి చెందిన కరపత్రాలు పట్టుకుని వస్తుండగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అనుమాన స్పదంగా కనిపించడంతో వారిని విచారించి అరెస్ట్ చేసినట్టు తెలిపిన పోలీసులు.