సిపిఐ రాష్ట్ర నేత సిద్ధి వెంకటేశ్వర్లు మరణం భారత కమ్యూనిస్టు పార్టీ కి తీరని లోటు

జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోత్ రామచందర్

టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి) : సిపిఐ రాష్ట్ర నేత సిద్ధి వెంకటేశ్వర్లు మరణం జిల్లా రాష్ట్ర పార్టీకి తీరని లోటని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామచందర్ ఆవేదన వ్యక్తం చేశారు తనకు రాజకీయ గురువుగా ఉన్న సిద్ధి వెంకటేశ్వర్లు విద్యార్థి దశ నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నేతగా ఎదిగిన క్రమశిక్షణ కలిగిన నాయకుడని ఆయన హఠాన్మరణం మమ్మల్ని బాధింప చేసిందని ఈ సందర్భంగా టేకులపల్లి మండల సమితి తరపున వారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.