సిర్పూరు ఎమ్మెల్యేకు మాతృ వియోగం

కాగాజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తల్లి రాజమ్మ(80) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గత రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.