సిసి రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

అల్వాల్(జనంసాక్షి) జూన్ 18
అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ ఇందిరా నగర్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరక 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ మున్సిపల్ అధికారులతో పనులను పరిశీలించడం జరిగింది. శనివారం ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని సిసి రోడ్డు పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు కాంట్రాక్టర్ నుఆదేశించారు. డివిజన్లోని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యకు పరిష్కారం చూపుతామని డివిజన్ లో ఉన్న పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తామని
అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు డిఈ కార్తీక్, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు మోసిన్, ఎండి రఫీ, సయ్యద్అలీమ్, అల్లదిన్, ఎండి షబీర్, సుదేష్, సురేష్, ముత్యాలు, మైవన్, రాజు, శ్రీనివాస్, శ్యాంసుందర్, ప్రభాకర్, రాజు, రామ్, జనార్ధన్, శేఖర్, లక్ష్మి, స్వప్న, ఉదయ, తదితరులు పాల్గొన్నారు.