సీఎం కేసీఆర్ వరంగల్ – భద్రాచలం – ఏటూరునాగారం పర్యటన… ముఖ్యాంశాలు

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన కోసం శనివారం వరంగల్ జిల్లాకు చేరుకొని సమీక్షించిన సీఎం కేసీఆర్ హన్మకొండలో బస చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు భద్రాచలానికి రోడ్డు మార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకున్నారు. ముందుగా భద్రాచలం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ పర్యటించి, ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించి సమీక్ష జరిపారు. అనంతరం అక్కడి నుంచి ఏటూరు నాగారం వరకు  సీఎం కేసీఆర్ హెలీకాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడ కూడా వరద బాధితులను పరామర్శించి, సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం ఏటూరునాగారం నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రికి హన్మకొండకు చేరుకున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన కోసం శనివారం వరంగల్ జిల్లాకు చేరుకొని సమీక్షించిన సీఎం కేసీఆర్ హన్మకొండలో బస చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు భద్రాచలానికి రోడ్డు మార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకున్నారు. ముందుగా భద్రాచలం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ పర్యటించి, ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించి సమీక్ష జరిపారు. అనంతరం అక్కడి నుంచి ఏటూరు నాగారం వరకు  సీఎం కేసీఆర్ హెలీకాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడ కూడా వరద బాధితులను పరామర్శించి, సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం ఏటూరునాగారం నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రికి హన్మకొండకు చేరుకున్నారు.
భద్రాచలంలో గంగమ్మ తల్లికి సీఎం కేసీఆర్ శాంతి పూజలు :తొలుత భద్రాచలం సమీపంలోని సారపాక వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్ కు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను బ్రిడ్జి మీద నుంచి సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు. అక్కడ గంగమ్మ తల్లికి సీఎం కేసీఆర్ శాంతి పూజలు జరిపారు. పసుపు, కుంకుమలు చల్లి సారె, సమర్పిచారు. అక్కడి నుంచి కరకట్ట వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని నిశితంగా పరిశీలించారు. కరకట్ట పటిష్టత కోసం చేపట్టవలసిన చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు.
పునరావాస కేంద్రంలో బాధితులను పరామర్శించిన సీఎం : అనంతరం భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు.
భద్రాచలం వాసులకు భరోసానిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ : భారీ వర్షాలను, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ను చూసి భద్రాచలం వాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమన్నారు. ప్రజలెవరూ భయపడవద్దని, ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ వారికి భరోసానిచ్చారు.
భద్రాచలంలో ముంపు సమస్యల శాశ్వత పరిష్కరానికి రూ.1,000 కోట్లు : భద్రాచలం ప్రాంతంలో వరద ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన నివాస కాలనీల నిర్మాణాలతో సహా, భద్రాచలం సీతారాముల దేవస్థానం చుట్టూ కరకట్ట అభివృద్ధికి, బూర్గంపాడు వైపు ఉన్న కరకట్ట మరమ్మతులు, ముంపు సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం కోసం రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ప్రకటించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని, వారి రక్షణకు కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని వారికి భరోసానిచ్చారు.
ముంపు ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన కాలనీల నిర్మాణం : తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు సీఎం కేసీఆర్ వారికి శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తమకు శాశ్వత ప్రాతిపదికన రిలీఫ్ దొరకుతుండటంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
భద్రాచలంలో సీఎం కేసీఆర్ సమీక్ష : • గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజలు ఎక్కువగా వరద తాకిడికి గురయ్యారు.• వరదల సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తత వల్ల ప్రాణ నష్టం జరగలేదు. • ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం ప్రశంసనీయం.• మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కలెక్టర్లకు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు.• భద్రాచలంలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం.• వరద ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలను నిర్మిస్తాం.• ఎత్తైన స్థలాల్లో శాశ్వత కాలనీలను నిర్మించాలి : కలెక్టర్ ను ఆదేశించిన సీఎం • భద్రాచలం పట్టణ కాంటూరు లెవల్స్ ను పరిగణలోకి తీసుకోవాలి.• కరకట్ట ప్రాంతాల్లోని ముంపు నివాసాలను కూడా తరలించాలి.• బాధితులకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలి.• శాశ్వత పరిష్కారం కోసం వెయ్యి కోట్ల నిధులను కేటాయిస్తున్నాం : సీఎం కేసీఆర్• ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం బ్లీచింగ్ చేయింలి : హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావుకు సీఎం కేసీఆర్ ఆదేశం.• ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక నిధులను అందజేస్తాం.• ఖమ్మం జిల్లా కలెక్టర్ సహా సీనియర్ అధికారులను భద్రాచలం రప్పించాలి.• రాముల వారి ఆలయం ముంపునకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపడతాం.• భద్రాచలం సీతారాముల పుణ్యక్షేత్రాన్ని ముంపు నుంచి రక్షించి, అభివృద్ధి చేస్తాం.• ఇందుకోసం త్వరలోనే మరోసారి భద్రాచలంలో పర్యటిస్తా : సీఎం కేసీఆర్• సీతమ్మ పర్ణశాలను కూడా వరద నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం.• ఇంకా వర్షాల ముప్పు పోలేదు. ఈ నెలాఖరుదాకా వానలు కొనసాగుతాయి.• మారిన వాతావరణ పరిస్థితుల్లో క్లౌడ్ బరస్ట్ లు జరుగుతున్నాయి.• పర్యవసానంగా వరద ముంపు అనూహ్యంగా పెరుగుతున్నది.• నిరంతరాయంగా కురిసే వర్షాల వల్ల తలెత్తే ఉత్పాతానికి నిదర్శనమే ఈ వరదలు• ఇంతటి వరద బీభత్సంలో కూడా కడెం ప్రాజెక్టు దేవుని దయ వల్ల నిలబడింది.• ఈ ప్రాజెక్టుకు నీటి వరద 2 లక్షల 90 వేల క్యూసెక్కులకు మించి దాటలేదు.• కానీ ఇపుడు 5 లక్షలకు మించి పోయినా ప్రాజెక్టు నిలబడింది.• వాగులు వంకలు పొంగుతున్నయి, చెరువులు, కుంటలు నిండినయి. • వానలు తగ్గినయని ప్రజలు అలక్ష్యం వహించవద్దు. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి• దుమ్మగూడెం చర్ల మండలాల్లో నీటిపారుదల అంశాలు నా దృష్టికి వచ్చాయి. • మొండికుంట వాగు, పాలెం వాగు బ్యాలెన్స్ పనులను పూర్తి చేస్తాం.• బాధితులు ఎత్తైన ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితులొచ్చాయి.• భద్రాచలం, బూర్గంపాడు, పినపాక నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో వరద సమస్యలు ఉత్పన్నమయ్యాయి.• రైతుల పంటలు నీట మునిగాయి. వాటిని సమీక్షించి తగు సహాయం అందిస్తాం.•  ఇప్పటి వరకు 25 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం.• పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాతే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారందరినీ ఖాళీ చేయించాలి.• ఒక్కో కుటుంబానికి 20 కిలోల చొప్పున మరో 2 నెలలపాటు ఉచితంగా బియ్యం అందజేస్తాం.• వరద ముంపు బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందజేస్తాం.• ప్రజలంతా మరో 15 రోజులు అలర్ట్ గా ఉండాలి. ఏమాత్రం రిలాక్స్ కాకూడదు. • హైదరాబాద్ నుంచి మేం ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ ప్రజలను వరదల నుంచి రక్షించి, ప్రాణహాని జరగకుండా కాపాడిన అధికార యంత్రాంగానికి అభినందనలు.
భద్రాచలం నుండి ఏటూరునాగారం వరకు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే భద్రాచలం పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ హెలీకాప్టర్లో ఏటూరునాగారం దిశగా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తూ సీఎం ఏటూరునాగారంలోని రామన్నగూడెం చేరుకున్నారు. రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఐటీడీఏ గెస్ట్ హౌజ్ కు వెళ్లిన ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గాలని గోదావరికి తల్లికి సీఎం కేసీఆర్ సారె సమర్పించి, శాంతి పూజలు నిర్వహించారు.  వరద తగ్గే వరకూ పునరావాస కేంద్రాలు కొనసాగుతాయి : సీఎం కేసీఆర్అనంతరం అక్కడి పునరావాస కేంద్రానికి వెళ్లిన, ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ముంపు బాధితులను పరామర్శించారు. భవనంలోని ప్రతి బాధితుడినీ కలుస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అధికారుల నుంచి వారికి అందుతున్న సహకారం, పునరావాస ఏర్పాట్లు, భోజన వసతులపై సీఎం ఆరా తీశారు. వరద తగ్గే వరకూ పునరావాస కేంద్రాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా  ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్ లో వరద ముంపుతో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత నిర్మాణాలు చేపడతామని సీఎం కేసీఆర్ బాధితులకు హామీ ఇచ్చారు. ‘‘ వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా రామ‌న్న‌గూడెంలో న‌ష్టం జ‌రుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ కాల‌నీల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింది. గ‌తంలో మాదిరి కాకుండా ఈ ప్రాంతానికి వ‌ర‌ద ముంపు  రాకుండా, ఇబ్బంది లేకుండా శాశ్వతంగా తగు చ‌ర్య‌లు తీసుకుంటాం. మీరంద‌రూ మంచిగా ఉండాల‌ని కోరుకుంటున్నా.. వ‌ర‌ద‌ల్లో ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి’’ అని సీఎం అన్నారు. వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌ట్‌లగానే అధికారులంద‌రూ వ‌చ్చి ఈ ప్రాంతాన్ని ప‌రిశీలించి, చ‌ర్య‌లు తీసుకుంటార‌ని బాధితులకు ముఖ్యమంత్రి భరోసానిచ్చారు.  వరద ప్రమాదం నుంచి ప్రజలను బయట పడేసిన ప్రజా ప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. రామన్నగూడెం పునరావాస కేంద్రం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి తిలకించారు.
ఏటూరునాగారంలో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ :  అనంతరం, ఏటూరు నాగారంలో ముఖ్యమంత్రి కేసీఆర్  మంత్రులు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నెలాఖరు వరకూ భారీ వర్షాలుంటాయన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంత పెద్ద భారీ వర్షాలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి  అభినందనలు తెలిపారు. ప్రతి శాఖ అధికారులు మూడు షిఫ్టులుగా పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని సీఎం అన్నారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని, కానీ, ఇపుడు ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద పరిస్థితులపై భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్ ను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరదతో చాలా చోట్ల మిషన్ భగీరథ పైపులు దెబ్బతిన్నాయని, వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.  ములుగు జిల్లాకేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరినందున దీన్ని వెంటనే మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
వరద ప్రభావిత జిల్లాలకు నిధులు : వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సహాయం కింద ప్రత్యేకంగా నిధులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాకు రూ.2 కోట్ల 50 లక్షలు, భద్రాచలం జిల్లాకు రూ.2 కోట్ల 30 లక్షలు, భూపాలపల్లి జిల్లాకు రూ.2 కోట్లు, మహబూబాబాద్ కు రూ. 1 కోటి 50 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం తెలిపారు.
రెండు హెలీకాప్టర్లు సిద్ధంగా ఉంచాలి :   వర్షాలతో వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగు జిల్లా కేంద్రంలో ఒక హెలీకాప్టర్ ను, భద్రాచలంలో మరొక హెలీకాప్టర్ ను సిద్ధంగా ఉంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్ వేలు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు  చేపట్టాలన్నారు. కరంటు సౌకర్యాన్ని కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. పక్కాపూర్ గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నాం. శ్యాంపల్లి ఆర్ అండ్ బీ రోడ్డు పనులను సత్వరమే చేపట్టాలని, వరద ప్రాంతాల్లో పనులు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిధులు ఎక్కువ ఖర్చయినా సరే.. నాణ్యమైన పనులు చేపట్టాలని సూచించారు.  ఏజెన్సీ ఏరియాలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే పారిశుధ్య పనులను చేపట్టాలని ఆదేశించారు. ‘‘ మనందరం ప్రజల కోసమే పనిచేయాలి. ఏ ఒక్కరినీ ఏమీ అనవద్దు. అటవీశాఖ అధికారులు పనుల ఇబ్బందుల పేరు మీద ఏమాత్రం ఇబ్బంది పెట్టవద్దు.’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  కాగా, ఏటూరునాగారంలో డయాలసిస్ సెంటర్ ను వెంటనే ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ నుంచి.. భద్రాచలం – ఏటూరునాగారం వరకు సాగిన ఈ పర్యటనల్లో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు టి.హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు  పొదెం వీరయ్య, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర్ రావు, హరిప్రియా నాయక్, సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్ రావు, రాములు నాయక్, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్ నాయక్, ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, డాక్టర్ టి.రాజయ్య, సీతక్క, ఎమ్మెల్సీలు ఎస్.మధుసూధనాచారి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాత మధుసూదన్ రావు, పాడి కౌశిక్ రెడ్డి,  తక్కెళ్లపల్లి రవీందర్ రావు, బండా ప్రకాశ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంతరావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు, ఆర్ అండ్ బీ ……. రవీందర్ రావు, హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాస రావు, భద్రాచలం జిల్లా కలెక్టర్ అనుదీప్, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా, హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, వరంగల్ కలెక్టర్ డాక్టర్ బి.గోపి, సింగరేణి సీఎండీ శ్రీధర్, ములుగు ఎస్పీ సంగ్రామ్, పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, జెడ్పీ చైర్మన్లు లింగాల కమల్ రాజు, కోరం కనకయ్య, గండ్ర జ్యోతి, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్,  భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, దిండిగాల రాజేందర్, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.