సీఎం చేతుల మీదుగా ‘మన బియ్యం’

రఘునాథపల్లి, (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన బియ్యం’ పథకం కింద మొదటిసారిగా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన అబ్ధిదారులు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి చేతుల మీదుగా నాణ్యమైన బియ్యాన్ని పొందారు. హైదరాబాద్‌లోని లలితకళాతోరణంలో ఉదయం 11 గంటలకు జరిగిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన 52 మంది బియ్యాని అందుకున్నారు. ఇందులో గ్రామపరిధిలోని వీరారెడ్డి తండాకు చెందిన భూక్యా లక్ష్మీ తోలుత అందుకుంది. బియ్యంతో పాటు పప్పు, నూనే, గోధుమ పిండి కూడా పంపిణీ చేశారు. మొదటి అవకాశం తమ గ్రామానికి రావటం అదృష్టంగా భావిస్తున్నామని కార్యక్రమానికి వెళ్లిన తూముకుంట్ల ఉమాదేవి, సుల్తాన్‌ దేవేందర్‌, భూక్యా లక్ష్మీ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు జేసీ ప్రద్యుమ్న, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ మహెేందర్‌రెడ్డి, డీటీ సత్యనారాయణస్వామి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సంధ్య, వీఆర్వోలు. డీలర్లు పాల్గొన్నట్లు తహశీల్దార్‌ కృష్ణమోహన్‌ తెలిపారు.